Hyderabad: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఉన్నతాధికారి

Hyderabad: నార్త్‌ జోన్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డికి స్థానికుల అభినందనలు

Update: 2023-08-30 10:20 GMT

Hyderabad: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఉన్నతాధికారి

Hyderabad: మానవత్వం చాటుకున్నారు ఓ ట్రాఫిక్‌ ఉన్నతాధికారి. బేగంపేట్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో హఠాత్తుగా కిందపడిపోయాడు. ఇది గమనించిన నార్త్‌ జోన్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి.. వెంటనే స్పందించి.. బాధితుడికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. దాదాపు 10 నిమిషాల పాటు ఆ వ్యక్తికి సీపీఆర్‌ చేసి.. హృదయ శ్వాసను మెరుగుపరిచి ప్రాథమిక చికిత్స ద్వారా ప్రాణాన్ని రక్షించారు. వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన నార్త్‌ జోన్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డిని స్థానికులు అభినందించారు.

Tags:    

Similar News