Hyderabad: మత్తుకు నిండు ప్రాణం బలి

Hyderabad: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన బైక్

Update: 2024-01-01 03:01 GMT

Hyderabad: మత్తుకు నిండు ప్రాణం బలి 

Hyderabad: బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేజిస్టిక్ గార్డెన్ సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. కాగా.. బైక్ నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చర్యలు చేపట్టినా.. మద్యం మత్తుకు ఓ ప్రాణం బలైంది.

Tags:    

Similar News