Breaking News: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి

Breaking News: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ ప్రకటించింది.

Update: 2021-06-26 14:43 GMT

రేవంత్‌ రెడ్డి(ఫైల్ ఇమేజ్ )

Breaking News: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ ప్రకటించింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది. అజారుద్దీన్‌, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్‌‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్‌‌లను నియ‌మించింది.

ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్‌, కన్వీనర్‌గా సయ్యద్‌ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజ నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

Tags:    

Similar News