Renuka Chowdhury: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది.. ఇదేలా బంగారు తెలంగాణ?

Renuka Chowdhury: హైదరాబాద్‌లో ఒక్కరోజే ముగ్గురు మైనర్లపై అత్యాచారాలు జరిగాయి

Update: 2022-06-07 07:24 GMT

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది.. ఇదేలా బంగారు తెలంగాణ? -రేణుకా చౌదరి

Renuka Chowdhury: తెలంగాణలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఒక్కరోజే ముగ్గురు మైనర్లపై అత్యాచారాలు జరిగితే షీ టీమ్స్‌ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ ఫైర్‌ అయ్యారు. ఇక అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు నమోదు కావడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు రేణుకా చౌదరి. మైనర్‌ బాలిక వివరాలను ఎమ్మెల్యే రఘునందన్‌ బయటపెట్టడం సరికాదన్నారు.

Tags:    

Similar News