Rangam Bhavishyavani 2020 : మరిన్ని గడ్డురోజులు.. రంగం భవిష్యవాణిలో అమ్మవారు

Update: 2020-07-13 06:23 GMT

Rangam Bhavishyavani 2020 : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. కరోనా నేపథ్యంలో రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరు చేసుకున్నదానికి వాళ్లు అనుభవించక తప్పదు కదా అని అమ్మ అన్నారు.

అయితే కట్టడి చేయడానికి తాను ఉన్నానని.. భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయండని ఆజ్ఞాపించారు. మరిన్ని గడ్డు రోజులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని అన్నారు. గడపగడప నుంచి తనకు నైవేద్యాలు సమర్పించాలని చెప్పారు. ప్రజలందిరినీ తాను కాపాడతానని, కరోనాపై పోరాడతానని తెలిపారు. రాబోయే రోజులు కష్టాలతో ఉంటాయని.. తీవ్రస్వరంలో చెప్పారు. 

Tags:    

Similar News