సీఎం కేసీఆర్, అక్బరుద్దీన్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాల్దర్వాజతోపాటు, మసీదుల అభివృధ్ధికోసం అక్బరుద్దీన్ కొరగానే నిధులు కేటాయించడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని ఆరోపించారు. హిందూ దేవాలయ అభివృద్ధికి నిధుల పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. హిందూ వ్యతిరేకిగా అక్బరుద్దీన్ పై ఉన్న ముద్ర పోగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ వేశారని రాజాసింగ్ ఆరోపించారు.
హిందూవులపై గతంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పించాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. తమతో పాటు ఇతరులు ఎవరూ సమయం అడిగినా ఇవ్వని కేసీఆర్ అక్బరుద్దీన్ కు సమయం ఇవ్వడమే కాకుండా నిధులు కేటాయించారన్నారు. కేసీఆర్ ఎంఐఎంకు మాత్రమే సీఎం కాదని తెలంగాణకు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు.