రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్ల ఇబ్బందులు.. ఆగిపోయిన నీటి సరఫరా
Rajahmundry: నీటిని సరఫరా చేసే మోటార్కి రిపేర్
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్ల ఇబ్బందులు.. ఆగిపోయిన నీటి సరఫరా
Rajahmundry: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రికి నీటిని సరఫరా చేసే మోటార్ పాడవడంతో నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులైనా మోటార్ రిపేర్ చేయకపోవడంతో బాత్ రూమ్లలో సైతం నీరు రావడంలేదని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిపేర్ కోసం కాంట్రాక్టర్ కు డబ్బులు చెల్లించినా పనిపూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.