రాష్ట్రపతి ప్రసంగం కాదు...ప్రభుత్వ ప్రసంగం - పొన్నాల

రాష్ట్రపతితో అవాస్తవాలు చెప్పించారు- పొన్నాల మద్దతు ధర విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన పొన్నాల

Update: 2021-01-29 10:30 GMT

రాష్ట్రపతి ప్రసంగం కాదు...ప్రభుత్వ ప్రసంగం - పొన్నాల

రాష్ట్రపతి ప్రసంగంపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రపతి ప్రసంగం కాదని..ప్రభుత్వ ప్రసంగమని పొన్నాల ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి చేత అవాస్తావాలు చెప్పించడం దారుణమన్నారు. మద్దతు ధర విషయంలో ప్రభుత్వం చేయిస్తున్న ప్రకటనల పట్ల పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని నిలదీశారు. గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ కొత్తగా తీసుకువస్తున్నట్టు చెప్పడం నీచమన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభించిన వాటిని కొనసాగిస్తూ తమ పనిగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మూడు వ్యవసాయ బిల్లులు ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి దారుల కొమ్ము కాయడానికి ఆర్డినెన్స్ తెచ్చారని పొన్నాల విమర్శించారు.

Tags:    

Similar News