Municipal Elections 2020: వివిధ ప్రాంతాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Update: 2020-01-22 07:28 GMT

మధిర: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు సజావుగా నడిచేలా చూడాలని పోలీసులను కోరారు.

నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఈదమ్మ గుడి 23వ పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును నాగర్ కర్నూల్ జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి వినియోగించుకున్నారు అనంతరం పోలీంగ్ సరళిని పరిశీలీంచారు.

నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు లో రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ అనంత నర్సింహా రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ లైవ్ అపుడట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Tags:    

Similar News