Telangana: సెప్టెంబర్ 17పై తెలంగాణలో పొలిటికల్ హీట్‌

*17న కార్యక్రమాలపై పోటీ పడుతున్న టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌

Update: 2022-09-15 12:00 GMT

Telangana: సెప్టెంబర్ 17పై తెలంగాణలో పొలిటికల్ హీట్‌

Telangana: సెప్టెంబర్ 17న నిర్వహించే కార్యక్రమాలపై టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. కేంద్రప్రభుత్వం ఒకపేరుతో, రాష్ట్ర ప్రభుత్వం మరొక పేరుతో తొలిసారి అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. మరోవైపు ఉద్యమ తెలంగాణ స్పూర్తిని రగిలించేలా తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మార్చుతామంటూ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకువస్తోంది. 1948 సెప్టెంబర్‌ 17న భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనం రోజు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా మావల్లే సాధ్యమైందంటే మా వల్లే అంటూ పార్టీలు పోటీ పడుతున్నాయి. సెప్టెంబర్ 17పై కార్యక్రమాలు నిర్వహించేందుకు మజ్లిస్ పార్టీ కూడా ముందుకు రావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 

Tags:    

Similar News