పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం

మండలంలోని కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి)లో శుక్రవారం పంచామృత అభిషేక నిర్వహించారు.

Update: 2020-01-31 10:32 GMT

పాల్వంచ: మండలంలోని కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి)లో శుక్రవారం పంచామృత అభిషేక నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ దంపతులు, అర్చకులు, భక్తులు అమ్మవారి మూలవిరాట్ కు వంచామృతాలతో అభిషేకం, వంచహారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.శ్రీనివాస్ దంపతులు, వేద పారాయణ దారు శ్రీ పద్మనాభశర్మ, అర్చకులుశ్రీ పురాణం పురుషోత్తమశాస్త్రి, రవికుమార్ శర్మ, దుర్గాప్రసాద్ శర్మ, నర్సింహమూర్తి, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Tags:    

Similar News