దిశ తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న NHRC బృందం

దిశ తల్లిదండ్రులను పోలీస్ అకాడమీకి తీసుకెళ్లనున్న పోలీసులు

Update: 2019-12-08 12:24 GMT
NHRC బృందం

శంషాబాద్‌లో దిశ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. దిశ తల్లిదండ్రులను పోలీస్ అకాడమీకి తరలించిన విచారించానున్నారు. దిశ హత్యాచారంపై NHRC బృందం దిశ కుటుంబ సభ్యులను విచారించనుంది. దిశ తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అయితే దిశ దశదిన కర్మ రోజు విచారణ పేరుతో తమ ఇబ్బంది పెడుతున్నారని దిశ తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే మహబూబ్‌నగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌ మార్చురీలో భద్రపరిచి ఉంచిన నిందితుల మృతదేహాలను పోలీసులు మయూరి పార్క్ దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్యశాల నూతన భవనానికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేనందున డెడ్ బాడీస్‌ను తరలించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మార్చురీలో ఉన్న నలుగురి నిందితుల డెడ్‌ బాడీస్ డీ- కంపోజ్ అయ్యాయని వాటిని వెంటనే వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 9 వరకు మృతదేహాలను భద్రపరచాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Full View

Tags:    

Similar News