శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న NHRC బృందం.. కాసేపట్లో ఎన్‌కౌంటర్‌ స్పాట్‌కు..

Update: 2019-12-07 06:40 GMT
NHRC బృందం

జాతీయ మానవ హక్కుల బృందం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. షాద్‌నగర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను NHRC బృందం పరిశీలించనుంది. తర్వాత నివేదిక రూపొందించనున్నారు. అయితే ఈనెల 9వ తేదీ వరకు నిందితుల మృతదేహాలు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో కోర్టు ఆదేశాలతో నిందితుల మృతదేహాలను పోలీసులు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో భద్రపరిచారు.

Tags:    

Similar News