Municipal Elections 2020: ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికలు

Update: 2020-01-22 09:36 GMT

షాద్ నగర్: పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం 28 వార్డులకు సంబంధించి జరుగుతున్న ఈ ఎన్నికల్లో... ఉదయం నుండే పోలింగ్ ప్రారంభమైంది.

చాలా వార్డుల్లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 37.5 46 పోలింగ్ శాతం మాత్రమే నమోదైందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. పట్టణ సీఐ శ్రీధర్ కుమార్ ద్విచక్ర వాహనంపై పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడ ఏ అలజడి లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ వార్డులో బ్యాలెట్ పత్రాలపై నోటా ప్రింట్ కాలేదని తెలిసింది.

Tags:    

Similar News