MP R Krishnaiah: రాజకీయ లబ్ధి కోసమే EWS రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తాం..

MP R Krishnaiah: EWS రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.

Update: 2022-11-07 11:22 GMT

MP R Krishnaiah: రాజకీయ లబ్ధి కోసమే EWS రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తాం..

MP R Krishnaiah: EWS రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే EWS రిజర్వేషన్లు తెచ్చారని అన్నారు. గతంలో 9 మంది జడ్జిల ధర్మాసనం..50శాతం మించకూడదని తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. 11 మంది సభ్యుల ధర్మాసనం విచారణ జరపాలని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.

రిజర్వేషన్లు అంటే పేదరిక నిర్మూలన పథకం కాదు. వెనకబడిన వర్గాలకు అధికారం ఇవ్వడం గౌరవం దక్కేలా చేసేందుకే రిజర్వేషన్లు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. అలాంటప్పుడు అగ్రవర్ణ కులాలకు రిజర్వేషన్ లు ఇస్తే బిసిలకు ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ తగ్గుతుంది. అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం EWS రిజర్వేషన్లపై పునరాలోచించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Tags:    

Similar News