ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

Bonalu Festival: వైభవంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు

Update: 2022-07-17 07:02 GMT

అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

Bonalu Festival: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించారు. ఆమె వెంట మహిళలు భారీగా తరలివచ్చారు. ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి రెండు వేల బోనాలతో ర్యాలీగా వచ్చారు. బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని మ‌నస్ఫూర్తిగా ఉండాల‌ని అమ్మవారిని కోరుకున్నట్టు ఆమె తెలిపారు. విప‌రీతంగా వాన‌లు కురుస్తోన్న నేప‌థ్యంలో వాన‌లు తెరిపివ్వాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆల‌యాల‌ల్లో శాంతి పూజ‌లు నిర్వహిస్తున్నార‌ని కవిత తెలిపారు. అమ్మవారి ద‌యవ‌ల్ల ప్రజ‌లంద‌రూ సుర‌క్షితంగా, సుభిక్షంగా ఉండాల‌ని కోరుకున్నానని క‌విత పేర్కొన్నారు.

Tags:    

Similar News