Hyderabad Neredmet Incident: అదృశ్యమైన చిన్నారి.. విషాదాంతం!

Hyderabad Neredmet Incident: నెరెడ్‌మెట్‌లోని కాకతీయ నగర్‌లో గురువారం సాయంత్రం తప్పిపోయిన 12 ఏళ్ల బాలిక కథ విషాదంతం అయ్యింది.

Update: 2020-09-18 12:32 GMT

Hyderabad Neredmet Incident: నెరెడ్‌మెట్‌లోని కాకతీయ నగర్‌లో గురువారం సాయంత్రం తప్పిపోయిన 12 ఏళ్ల బాలిక కథ విషాదంతం అయ్యింది. నిన్న రాత్రి సైకిల్‌పై బయటకు వెళ్లిన సుమేధ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో కలిసి నిన్నరాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇవాళ బండచెరువులో బాలిక మృతదేహం లభ్యం అయ్యింది. అప్పటివరకు తమ పాపా ఏదో ఓ చోట క్షేమంగా ఉంటుందని అనుకున్న తల్లిదండ్రులు. కనీ, ఆ మృతదేహాన్ని 5 వ తరగతి విద్యార్థి సుమేధగా గుర్తించారు.

ఇంతలో, భారీ వర్షాల తరువాత దీన్ దయాల్ నగర్ లోని నాలాలన్నీ నీటితో నిండిపోయాయని స్థానిక నివాసితులు పోలీసులకు తెలిపారు. తరువాత, బాలిక సైకిల్‌ను నాలా సమీపంలో పోలీసులు గమనించి, బాలికను కనిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించిన జిహెచ్‌ఎంసి, రెస్క్యూ టీం అధికారులను అప్రమత్తం చేశారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత అధికారులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. అనంతరం చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. 

Tags:    

Similar News