రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ల వద్ద రైతుల కోసం 3 కోట్ల రూపాయలతో నిధులతో నిర్మించనున్న గోదాముకు శంకుస్థాపన చేశారు. మరోవైపు 4.5 కోట్ల నిధులతో చేపట్టనున్న కోల్డ్స్టోరేజ్ రూమ్స్కి సంబంధించిన పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ముస్తాబాద్ ఎల్లారెడ్డిపేట మండలాల్లో పలు కుల సంఘాల కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన