షర్మిల కొత్త పార్టీపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

Update: 2021-02-13 09:53 GMT

షర్మిల కొత్త పార్టీపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణలో కొత్త పార్టీలు సక్సెస్ కాలేవన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించిన ఆయన టీడీపీ లాంటి పార్టీలే ఇప్పుడు మనుగడ లేకుండా పోయాయన్నారు. ఆంధ్రా పార్టీలను ప్రజలు స్వాగతించినా.. సక్సె్స్ అయ్యే అవకాశాలు లేవన్నారు మంత్రి ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా జరుగనున్న కోటి వృక్షార్చనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఈనెల 17న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Full View


Tags:    

Similar News