తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం అయ్యారు. పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని.. ఆ జెండాను తయారు చేసింది కూడా కేసీఆరే అని అన్నారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో తాను టీడీపీలో ఉన్నానన్న ఎర్రబెల్లి ఉద్యమానికి అనుకూలంగా లేఖ కూడా ఇప్పించానని.. గుర్తు చేశారు. మరో మంత్రి ఈటల అంశం సమిసిపోయిందని ఆయనకు ఎలాంటి ఢోకా లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.