గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడి..

Update: 2020-12-04 06:54 GMT

జీహెచ్ఎంసీ ఫలితాలో తొలి రిజల్ట్‌ వెల్లడయ్యింది. అనుకున్నట్లుగానే మొదటగా మెహిదీపట్నం డివిజన్‌ రిజల్ట్‌‌ వెలువడింది. ఆ డివిజన్‌ను ఎంఐఎం కైవసం చేసుకుంది. ఎంఐఎం నేత మాజీద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. ఆది నుంచి ఎంఐఎం అభ్యర్థి లీడింగ్‌లో కొనసాగుతున్నారు. చివరిగా ఎంఐఎం విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బోణి కొట్టింది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్‌లో అత్యల్పంగా మెహిదీపట్నంలోనే తక్కువగా ఓట్లు పోలయ్యాయి. దీంతో తొలిరౌండ్‌లోనే ఫలితం వెలుడింది.

Tags:    

Similar News