ఇవాళ గాంధీభవన్‌లో పార్టీ నేతలతో ఠాక్రే భేటీ

* హాత్‌ సే హాత్‌ జోడో యాత్రపై ఉపాధ్యక్షులతో సమావేశం

Update: 2023-02-15 03:59 GMT

ఇవాళ గాంధీభవన్‌లో పార్టీ నేతలతో ఠాక్రే భేటీ

Gandhibhavan: ఇవాళ గాంధీభవన్‌లో పార్టీ నేతలతో మాణిక్‌రావ్‌ ఠాక్రే భేటీ కానున్నారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రపై ఉపాధ్యక్షులతో ఆయన సమావేశమవుతారు. పార్టీ అనుబంధ సంఘాలు ఎస్టీ సెల్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులతో ఠాక్రే భేటీ కానున్నారు. ఇక రేపు రేవంత్‌రెడ్డి పాదయాత్రలో ఠాక్రే పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఠాక్రే బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో ఇంకా చూడలేదని చెప్పారు. వీడియోలు చూశాక మాట్లాడుతానని స్పష్టం చేశారు మాణిక్‌రావు ఠాక్రే.

Tags:    

Similar News