Peddapalli: పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలి ఇంట్లో చొరబడి..

Peddapalli: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి గొంతు కోసి హత్య చేసిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలో జరిగింది.

Update: 2021-11-09 14:29 GMT

Peddapalli: పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలి ఇంట్లో చొరబడి..

Peddapalli: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి గొంతు కోసి హత్య చేసిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలో జరిగింది. కెకె నగర్‌కు చెందిన గొడుగు అంజలి, తారకరామారావు నగర్‌కు చెందిన చాట్ల రాజు గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంజలిని పెళ్లి చేసుకోవాలంటూ రాజు వేధింపులకు గురి చేయటంతో రెండు సార్లు పంచాయితీ కూడ పెట్టారు. అయినా వదలని రాజు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తిపీటతో అంజలి గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందిన పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News