సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో భారీ చోరీ
♦ 6 కిలోల బంగారం, 7 కిలోల వెండి, 18 లక్షల నగదు అపహరణ ♦ వడ్డీ వ్యాపారికి దోపిడి దొంగల టోకరా ♦ పనిపై బయటకు వెళ్లొచ్చే సరికే ఇళ్లు గుల్ల
సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని మల్లికార్జుననగర్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 6 కిలోల బంగారం, 7 కిలోల వెండి ఆభరణాలు, 18 లక్షల నగదును అపహరించుకుపోయారు. వడ్డీ వ్యాపారం చేస్తున్న సరళ దంపతులు నిన్న సాయంత్రం పనిపై బయటకు వచ్చి చూసే సరికి ఇళ్లు గుల్ల చేశారు.
దీంతో షాక్ కు గురైన సరళ దంపతులు బేగంపేట్ పోలీసులను ఆశ్రయించారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా లోపల నుంచి సొత్తును కాజేశారు. ఇటు రంగంలోకి దిగిన బేగంపేట్ ఏసీపీ రామ్రెడ్డి క్లూస్ టీమ్తో దర్యాప్తు చేపట్టారు. ఆధారాలు సేకరించారు. దొంగతనం ఎలా జరిగింది..? ఎవరు చేశారు..? ఇంట్లో వారి పనా..? లేక బయట నుంచి వచ్చిన ఇతరుల పనా..? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని ఏసీపీ తెలిపారు.