మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
Mahabubnagar: ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,439 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
Mahabubnagar: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికలో మొత్తం 14 వందల 39 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం కొడంగల్కు సీఎం రేవంత్రెడ్డి వెళ్లనున్నారు. ఎంపీడీవో ఆఫీస్లో సీఎం రేవంత్రెడ్డి ఓటు వేయనున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుండగా..ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.