Mahabubabad: జిల్లా కోర్టు సంచలన తీర్పు.. దీక్షిత్‌ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధింపు

Death Sentence: మహబూబాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Update: 2023-09-29 09:29 GMT

Mahabubabad: జిల్లా కోర్టు సంచలన తీర్పు.. దీక్షిత్‌ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధింపు

Death Sentence: మహబూబాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కాగా 2020 అక్టోబర్‌18న కుసుమ వసంత, రంజిత్‌ రెడ్డి దంపతుల కుమారుడు దిక్షీత్‌ రెడ్డిని మందసాగర్‌ డబ్బుల కోసం కిడ్నాప్‌ చేసి కిరాతకంగా హత్య చేశాడు.

ఇది జరిగిన మూడురోజుల అనంతరం తాళ్లపూసపల్లి సమీపంలో ఉన్న ధానమయ్య గుట్టలో దీక్షిత్ రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శనిగపురంకు చెందిన పంక్చర్ షాప్ నిర్వహుకుడు మంద సాగర్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. మూడేళ్లుగా సాగిన విచారణలో తాజాగా.. ఉరి శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

Tags:    

Similar News