కలిసి బతకలేమని.. ప్రేమజంట ఆత్మహత్య
జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు.
జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమకు పెద్దలు అంగీకరించ లేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కథలాపూర్ మండలం సిరికొండ శివారులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తితే... రాజారాంతండాకు చెందిన లకావత్ సూర్యనాయక్-ప్రమీల దంపతుల కొడుకు మహిపాల్(18), భూక్య బుల్లి-తిరుపతి కూతురు శిరీష(18) కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. స్కూల్ ఏజ్ లో మొదలైన వీరి ప్రేమ డిగ్రీ వరకు కొనసాగింది. శిరీషా కోరుట్లలోని ఓ డిగ్రీ కళశాలలో చదువుతోంది. మహిపాల్ కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కాలేజ్ లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరి ఇద్దరి ప్రేమ వ్యవహారం ఇరువురి కుంటుంబ సభ్యులకు తెలియడంతో వారు మందలించారు.
శిరీషకు వారి కుటుంబ సభ్యుల ఆమెకు మరో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. రాజన్నసిరిసిల్లా జిల్లాకు చెందిన యువకుడితో శిరీషతో నిశ్చితార్థం చేశారు. ఇద్దరి రెండు నెలల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న మహిపాల్ కరీంనగర్ నుంచి రాజారాంతండాకు వచ్చాడు. శుక్రవారం ఉదయం శిరీషా, మహిపాల్ కనిపించకుండా వెళ్లిపోయారు. వీరిద్దరి కోసం కుటుంబ సభ్యులు గాలించారు. అయితే సిరికొండ అటవీప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.