తెలంగాణలో అన్ని జోన్ల లోనూ మద్యం షాపులకు అనుమతి : సీఎం కేసీఆర్

ఇక ఇదే మీడియా సమావేశంలో మందుబాబులకి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో మద్యం షాపులకు అనుమతి ఇస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

Update: 2020-05-05 17:31 GMT
KCR(File Photo)

సుదీర్ఘ క్యాబినెట్ మీటింగ్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మే 29 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. కరోనా రాష్ట్రంలో అదుపులో ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు. ఇక ఇదే మీడియా సమావేశంలో మందుబాబులకి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో మద్యం షాపులకు అనుమతి ఇస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కానీ ధరలపైన 16 శాతం పెంచుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఇక రెడ్ జోన్స్ లలో కూడా లిక్కర్ షాపులకి కేసీఆర్ అనుమతి ఇచ్చారు. మద్యం యజమానులు, వినియోగదారులు కచ్చితంగా సామజీక దూరం పాటించాలని వెల్లడించారు. లేనిచో గంటలో మద్యం దుకాణాలను వెంటనే ముసివేస్తామని కేసీఆర్ వెల్లడించారు. అయితే కచ్చితంగా మాస్క్ ధరించాలని అన్నారు. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు మద్యం షాపులు తెరుచుకుంటాయని కేసీఆర్ వెల్లడించారు. 

Full View


Tags:    

Similar News