పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే బలాలకు అప్పగించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తప్పు పట్టారు. ప్రజాస్వామ్య విలువకు తిలోదకాలు ఇచ్చి సాంప్రదాయానికి విరుద్ధంగా ఇచ్చారన్నారు. ప్రభుత్వం చేసే అవినీతి, తప్పిదాలు, ప్రాజెక్టుల్లో దోపిడీ వంటి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎంఐఎంకు అప్పగించారని ఆరోపించారు.