బండి సంజ‌య్‌పై మంత్రి కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావా..

Defamation Case: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు.

Update: 2022-05-13 11:45 GMT

బండి సంజ‌య్‌పై మంత్రి కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావా..

Defamation Case: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు న్యాయవాది ద్వారా బండి సంజయ్‌కు నోటీసులు పంపారు. ఈనెల 11వ తేదీన ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ పైన కొన్ని ఆరోపణలు చేశారు బండి సంజయ్. ఆయన చేసిన ఆరోపణలపైన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని కేటీఆర్ ఇటీవల డిమాండ్ చేశారు. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని అని హెచ్చరించిన మంత్రి కేటీఆర్.. తాజాగా ఆ మేరకు నోటీసులు పంపారు.

మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయ‌న‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌చారం పొందాల‌నే దురుద్దేశంతోనే బండి సంజ‌య్ అబ‌ద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయ‌వాది పేర్కొన్నారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలను కేటీఆర్‌కు ఆపాదించారని తెలిపారు. 48 గంటల్లో కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సివిల్‌, క్రిమినల్‌ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.



 


Tags:    

Similar News