KTR: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో కాంగ్రెస్ విఫలమైంది
KTR: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కారణమయిందన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని...అవకతవకలపై జుడీషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలేవరో తేల్చాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.