KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు
KTR: కేసీఆర్పై కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయడంలేదు
KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు. ఎండిన వరి పంటల రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. కాళేశ్వరం, కేసీఆర్పై కడుపు మంటతో సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డ రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ, హైదరాబాద్కు తిరగడం తప్ప రైతులను పరామర్శించే టైమ్ లేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతులను ఆదుకుని.. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.