మహానేత వైఎస్‌ కు నివాళులు అర్పించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Update: 2019-09-02 11:15 GMT

దివంగత మహానేత డాక్టర్ : వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిరెడ్డి రంగారెడ్డిలు.. వైఎస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ... ఉచితంగా విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్,108 వంటి వ్యవస్థలను నెలకొల్పిన ఘనత వైఎస్సార్‌ దేనని కొనియాడారు. జలయజ్ఞం ద్వారా రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేపట్టారన్నారు. కాళేశ్వరానికి పెట్టిన బాహుబలి మోటార్లు తెచ్చింది కూడా వైఎస్సారే' అని వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News