కాళేశ్వరం రివర్స్ పంపింగ్ వాటర్ నిజామాబాద్ జిల్లాకు చేరడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం జిల్లా సరియద్దు కమ్మర్ పల్లిలోని ఉప్లూర్ రోడ్డు వరద కాలువ బ్రిడ్జ్ వద్ద కాళేశ్వరం నీటిని టీఆర్ఎస్ నేతలు, ఆయకట్టు రైతులు పూలతో స్వాగతం పలికి సంబరాలు జరుపుకున్నారు. కాళేశ్వరం వాటర్ రావడం చారిత్రక విజయం అని కొనియాడారు. రివర్స్ పంపింగ్ ప్రదాత సీఎం కేసీఆర్కు జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.