కాచిగూడ రైలు ప్రదమాద ఘటనలో గాయపడిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా మాదింది. ప్రమాదం సమయంలో అతని కాలు తీవ్ర గాయమైందని, కుడి కాలు తొలిగించామని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇంకా అతడి పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రైలు ప్రమాదం లోకో పైలట్ చంద్రశేఖర్ తోపాటు 18 మంది గాయపడ్డారు.
కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో లోకో పైలట్ చంద్రశేఖర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ మాస్టర్తో కొందరు ఉద్యోగులను విచారిస్తున్నారు. సిగ్నల్ క్లియరెన్స్ లేకుండారైలు ముందుకు వెళ్లిందని, లోకో పైలట్ చంద్రశేఖర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ఫిర్యాదు చేశారు.