తెలంగాణలో ఆరోగ్య శాఖను దేశానికే రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతామన్నారు మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. పలు ఆస్పత్రులు నీటిగా లేకపోవడంతో సిబ్బందిపై ఫైరయ్యారు. పేదవారికి మెరుగైన ప్రభుత్వ వైద్యం అందించేందుకు సీఎం సూచనల మేరకు కీలక మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు చెప్పారు.