హైదరాబాద్ మోతీనగర్లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభం
హైదరాబాద్ మోతీనగర్లో ఇందిరమ్మ కాంటీన్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
హైదరాబాద్ మోతీనగర్లో ఇందిరమ్మ కాంటీన్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం ఆదేశాలతో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించామని పొన్నం తెలిపారు. నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్లలో భోజనం, 5 రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ కూడా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడినప్పటికీ.. స్వల్ప రేట్లకే పేద వారికీ నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని పొన్నం పేర్కొన్నారు.