దిశ కేసులో నిందితుల మృతదేహాలకు పంచనామా పూర్తి... కాసేపట్లో పోస్ట్‌మార్టం

Update: 2019-12-06 07:50 GMT

దిశ హత్యాచారం, హత్య కేసులో షాద్‌నగర్‌లోని చటాన్ పల్లిలో నిందితులు ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ డెడ్ బాడీలకు క్లూస్ టీమ్ శవ పంచనామా పూర్తి చేసింది. ఘటనా స్థలంలో క్లూస్‌ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో పంచనామా జరిగిన అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం నాలుగు మృతదేహాలను ఫరుక్‌ నగర్‌ కుందూర్‌, నందిగామ, చౌదరిగూడ ఎమ్మార్వోలకు అప్పగించారు. మరోవైపు మృతదేహాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. 

Tags:    

Similar News