మానస సరోవర్‌లో చిక్కుకున్న హైదరాబాదీలు

Update: 2019-06-24 11:02 GMT

హైదరాబాద్‌ నుంచి మానస సరోవరం యాత్రకు వెళ్లిన 40 మంది అక్కడే చిక్కుకున్నారు. ఈ నెల 13 హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేట్ టూర్స్‌ ద్వారా మానస సరోవరం యాత్రకు వెళ్లారు. అయితే, ప్రతికూల పరిస్థితుల్లో యాత్రికులు చిక్కుకుపోయారు. యాత్రికులు గత ఐదు రోజులుగా అక్కడ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. రక్షించాలంటూ వారు తమ కుటుంబ సభ్యులకు వీడియోలు పంపించారు. తాము చిక్కుకున్నా ట్రావెల్స్‌ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ యాత్రికులు మండిపడుతున్నారు. తమను స్వస్థలానికి పంపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News