నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలపై హైకోర్టు ఆదేశాలు

High Court: బహిష్కరణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు

Update: 2023-01-03 06:40 GMT

నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలపై హైకోర్టు ఆదేశాలు

High Court: నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్న వీడీసీ ఆగడాలను అరికట్టాలని.. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు ఉత్తర్వులు పంపింది. జక్రాన్‌పల్లిలో 70 రోజులుగా గీత కార్మిక కుటుంబాలను బహిష్కరించారు. దీంతో శంకర్ గౌడ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. కల్లు అమ్ముకోవాలంటే 5 లక్షలు చెల్లించాలని వీడీసీ ఆంక్షలు విధించిందని కోర్టుకు తెలిపారు. దీంతో బహిష్కరణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News