పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని పెన్షన్ పథకం అమలు చేస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రశాంత్ నగర్లో పెరిగిన పెన్షన్ పత్రాలను హరీష్ రావు అందించారు.