Harish Rao: రుణమాఫీ చేయని కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి
Harish Rao: మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు.
Harish Rao: మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. రైతు రుణ మాఫీ హామీ ఏమైందని ఆయన నిలదీశారు. మెదక్ జిల్లా పాపన్నపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్రావు.. రైతులను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఒకసారంటే మోసం పోయాం.. రెండోసారి కూడా మోసపోదామా అంటూ ప్రశ్నించారు. గతంలో రైతుబంధు వేస్తామంటే కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసి ఆపింది, పంటలు చేతికి వచ్చినా ఇప్పటికీ కొంతమందికి రైతుబంధు రాలేదన్నారు. రైతుబంధు డబ్బులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. రాజకీయాలకు బీజేపీ దేవుడిని వాడుకుంటోందని హరీష్రావు మండిపడ్డారు.