Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే

Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు మాజీమంత్రి హరీష్‌రావు.

Update: 2026-02-07 09:08 GMT

Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు మాజీమంత్రి హరీష్‌రావు. బట్ట కాల్చి బీఆర్‌ఎస్‌పై వేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ పేరిట పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ కాళేశ్వరం వల్లే తెలంగాణలో బంగారమైన పంటలు పండుతున్నాయని అన్నారు. గజ్వేల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్‌ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని నిప్పులు చెరిగారు.

Tags:    

Similar News