ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమైన తెలంగాణ గవర్నర్ తమిళిసై... రాష్ట్రంలో పరిస్థితులపై నివేదిక అందజేశారు. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలు, శాంతిభద్రతలపై చర్చించారు. ప్రధాని మోడీతో దాదాపు అరగంటపాటు సమావేశమైన తమిళిసై... తెలంగాణ సమస్యలపై నివేదించినట్లు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్, పోలీసుల దమనకాండపై ఆర్టీసీ కార్మికులు ఫిర్యాదుచేసిన తర్వాతి రోజే.... గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లి... కేంద్ర పెద్దలను కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.