బాసరలో విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన గవర్నర్.. 48 గంటల్లో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశం..

Basara IIIT: బాసర RGUKTలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2023-06-16 09:45 GMT

బాసరలో విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన గవర్నర్.. 48 గంటల్లో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశం..

Basara IIIT: బాసర RGUKTలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు విపరీతమైన చర్యలను ఆశ్రయించవద్దని సూచించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని వైస్ చాన్సలర్ ను గవర్నర్ కోరారు. విద్యార్థులు తీవ్ర చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న చర్యలతో సహా 48 గంటల్లో సమగ్ర నివేదిక అందించాలని గవర్నర్ ఆదేశించారు.

Tags:    

Similar News