ప్రభుత్వం కార్మికుల హక్కులు అణచివేస్తుంది-భట్టి

-ఆర్టీసీ కార్మికులపై పోలీసుల లాఠీఛార్జి ఖండిస్తున్నాం -కాంగ్రెస్ నేతల ఇళ్లను పోలీసులు దిగ్భందిస్తున్నారు

Update: 2019-11-09 15:21 GMT
Bhatti Vikramarka

ఆర్టీసీ కార్మికులపై పోలీసుల లాఠీఛార్జి, అక్రమ అరెస్టులను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. కార్మికుల హక్కులను ప్రభుత్వం అణచివేస్తుందని ఆరోపించారు. ప్రజల భావ వ్యక్తీకరణను అణచివేయరాదన్నారు. రాష్ర్టంలో ఏ చిన్న ఆందోళన కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను పోలీసులు దిగ్భందం చేస్తున్నారని ఆరోపించారు. చలో ట్యాంక్ బండ్ సందర్బంగా పోలీసుల చేతిలో గాయపడ్డ వారికి ప్రభుత్వమే వైద్యచికిత్స జరిపించాలని డిమాండ్ చేశారు.  

Tags:    

Similar News