ఈనెల 9 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయ్భాస్కర్ ను.. విప్ లుగా గొంగిడి సునీత, గంప గోవర్థన్, గువ్వల బాలరాజుతో పాటు అరికెపూడి గాంధీ, రేగ కాంతారావు, బాల్క సుమన్ పేర్లను ఖరారు చేశారు.