Nizamabad: మాస్క్ పెట్టుకోమంటే బాదేశాడు

Nizamabad: నిజామాబాద్‌లోని గౌతమ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది.

Update: 2021-04-17 10:33 GMT

Nizamabad: మాస్క్ పెట్టుకోమంటే బాదేశాడు

Nizamabad: నిజామాబాద్‌లోని గౌతమ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మాస్క్‌ పెట్టుకొని చెత్త వేయమన్నందుకు మున్సిపల్‌ సిబ్బందిపై దాడికి దిగారు తండ్రీ కొడుకులు. పారతో దాడిచేసి ఇద్దరు కార్మికులను గాయపరిచారు. 'నేను మస్క్ పెట్టుకోకపోతే.. మీకేంటి.. నీను పెట్టుకోను.. ఏం చేసుకుంటావో చేసుకో' అంటూ పార, ఇనుప రాడ్లతో వారిపై దాడికి దిగారు. ఈ ఘటనపై కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తండ్రీ కొడుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మాపై బెదిరింపులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News