కుమ్రంభీమ్ జిల్లా కాగజ్నగర్లో యూరియా కోసం కలెక్టర్ను రైతులు నిలదీశారు. కలెక్టర్ వాహనానికి అడ్డంగా కూర్చుని నిరసన చేపట్టారు. యూరియా కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సర్ది చెప్పడంతో వారు శాంతించారు.