Hyderabad: చదువుపై ఆసక్తి లేదు..తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని సూసైడ్..

Hyderabad: చదువుకోలేనని ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి

Update: 2023-03-04 08:30 GMT

Hyderabad: చదువుపై ఆసక్తి లేదు..తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని సూసైడ్ నోట్

Hyderabad: చదువుపై ఆసక్తి లేక.. తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక.. ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చదువుకోలేకపోతున్నాననే బాధతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాలానగర్‌లో చోటుచేసుకుంది. వినాయకనగర్‌కు చెందిన శివప్రసాద్‌ అనే విద్యార్థి బీటెక్ చదువుతున్నాడు. సరిగా చదువుకోకపోవడంతో ఇంట్లో తల్లిదండ్రులు మందలించారు. దీంతో చదువంటే ఇష్టం లేని శివప్రసాద్‌.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏ మాత్రం ఆసక్తి లేదని.. తల్లిదండ్రులు చదువుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్‌నోట్‌‌లో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టకు తరలించారు. 


Full View


Tags:    

Similar News